Saturday, April 27, 2024

తండ్రి డబ్బు ఇవ్వలేదని తాగుబోతు ఘాతుకం

- Advertisement -
- Advertisement -

మహాసముంద్ (చత్తీస్‌గఢ్ ): మహాసముంద్ జిల్లాలో పుట్కా గ్రామంలో 24 ఏళ్ల యువకుడు తండ్రి డబ్బు ఇవ్వలేదని తన తల్లిదండ్రులను, నాన్నమ్మను హత్య చేయడమే కాకుండా, వారి మృతదేహాలను దగ్ధం చేశాడని పోలీస్‌లు గురువారం వెల్లడించారు. నిందితుడు యుదిత్ భోయిని బుధవారం అరెస్టు చేశారు. యుదిత్ బోయి మద్యానికి బానిస. గతవారం పుట్కా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈనెల 12 న యుదిత్ తన తండ్రి ప్రభాత్ భోయి (53), తల్లి ఝార్నా (47) , నాన్నమ్మ సులోచన (75) వైద్యం కోసం ఈనెల 8న రాయ్‌పూర్ వెళ్లారని,

తరువాత వారు కనిపించలేదని పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్టు ఎస్‌పి ధర్మేంద్రసింగ్ చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు అదృశ్యమైన తరువాతనే నిందితుడు యుదిత్ బెడ్, అల్మరా, ఎయిర్ కండిషనర్, మొబైల్ ఫోన్, ఇతర పరికరాలు కొన్నాడని గ్రామం లోని కొంతమంది తమ దర్యాప్తులో వెల్లడించారని ఎస్‌పి చెప్పారు. ఈలోగా యుదిత్ తమ్ముడు , రాయ్‌పూర్ కాలేజీ మెడికల్ విద్యార్థి పుట్కా గ్రామం చేరుకున్నాక , ఇంటి పెరడులో కూరగాయల తోటలో బూడిద, రక్తం మరకలు, ఎముకల తునకలు చూసి పోలీస్‌లకు చెప్పడంతో అసలు నేరం బయటపడిందని ఎస్‌పి తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News