Tuesday, April 30, 2024

ఆర్థర్ రోడ్ జైలులో ఫిల్ము ఫైనాన్షియర్ లక్డావాలా మృతి

- Advertisement -
- Advertisement -

film financier Yusuf Lakdawala passes away

ముంబై : మహారాష్ట్రకు చెందిన బిల్డర్, బాలీవుడ్ ఫిల్మ్ ఫైనాన్షియర్ యూసఫ్ లక్డావాలా ముంబై ఆర్థర్ రోడ్ జైలులో గురువారం మృతి చెందారు. భూ కబ్జా కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఇడి) లక్డావాలా (76)ను అరెస్టు చేసింది. పుణె లోని ఖండాలా ప్రాంతంలో రూ. 50 కోట్ల విలువైన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించినట్టు లక్డావాలాతోపాటు పలువురిపై ముంబై పోలీసులు (ఆర్థిక నేరాల విభాగం) ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్డు జైలులో ఉంటున్నారు. మృతదేహాన్ని జేజే ఆస్పత్రికి తరలించారు. లక్డావాలా మరణానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News