Wednesday, May 1, 2024

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నిర్మాత అచ్చి రెడ్డి, సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  సినీ నిర్మాత అచ్చిరెడ్డి, సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డిలు శనివారం మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సిఎం రేవంత్‌ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా తాము సిఎం రేవంత్‌ రెడ్డిని తొలిసారిగా మర్యాదపూర్వకంగా కలిశామని అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు తెలిపారు. సిఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు మరింత సహాయ, సహకారాలు అందించనుందన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News