Friday, April 26, 2024

హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance to the families of home guards

మనతెలంగాణ, హైదరాబాద్ : కరోనాతో మృతిచెందిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆర్థిక సాయం అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డులుగా శ్రీనయ్య, నర్సింగ్ రావు, మహేష్, పోచయ్య పనిచేస్తున్నారు. కరోనా సమయంలో వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. సిఎస్‌ఆర్ ఫండ్ కింద మ్యాన్‌కైండ్ ఫార్మా అందజేసిన రూ.12లక్షలను రూ.3లక్షల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో డిసిపి అనసూయ, ఎడిసిపి వెంకట్, ఎసిపి కృష్ణ, ఫార్మా మేనేజర్ తరమేస్ కుమార్, సమీర్ కుమార్, రమేష్ కుమార్, అస్గర్ అలీ మిర్జా, శ్రీనివాస్, ఎండి ఇంతియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News