Friday, April 26, 2024

సైలెన్సర్లు మార్చిన బైకులకు జరిమానా

- Advertisement -
- Advertisement -

Fines For Two Wheelers Causing Noise Pollution

భద్రాచలం: భద్రాచలం ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో శబ్ధకాలుష్యం చేస్తున్న వాహనాలపై ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భద్రాచలం ట్రాఫిక్ ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో ఈ డ్రైవ్ కొనసాగింది. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్‌లు మార్చి పెద్ద శబ్ధం చేసే సైలెన్సర్లను బిగించిన వాహన దారులను ఆపి జరిమానాలు విధించారు. అలాగే బైకులకు ఉన్న సైలెన్సర్లను పరిశీలించి, అవి పెద్దశబ్ధం చేసేవిగా ఉంటే వాటిని స్వయంగా మెకానిక్ సహాయంతో మార్పించారు. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణపై పలువురు ఆయనను అభినందించారు.

Fines For Two Wheelers Causing Noise Pollution

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News