Monday, May 6, 2024

పదో తరగతి బాలిక కళ్లను పీకేసి… చేతులకు మొలలు కొట్టి…

- Advertisement -
- Advertisement -

లక్నో: పదో తరగతి చదువుతున్న బాలికను అతి దారుణంగా హత్య చేశారు. చేతులకు మేకులు కొట్టి, కళ్లను బయటకు పీకేసి అనంతరం ఘోరంగా హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శుక్రవారం పదో తరగతి చదువుతున్న బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతికారు. శనివారం ఉదయం బాలిక మృతదేహం వారు నివసిస్తున్న గ్రామ శివారులో కనిపించింది. చేతులకు మొలలు కొట్టి, కళ్లను పీకేయడంతో మృతదేహం నగ్నంగా కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాలికను గొంతు నులిమి చంపేశారని, అత్యాచారం జరిగిన విషయం శవ పరీక్షలో తెలుస్తుందని పోలీస్ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపాడు.

Also Read: స్వరాష్ట్రంలో సుపరిపాలన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News