Saturday, April 27, 2024

ఫెయిలయ్యామని ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Five Inter students commit suicide in Andhra Pradesh

అమరావతి: ఎపిలో ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఇంటర్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడులో బావిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లాలోనే మద్దిపాడు మండలం వల్లవరంలో ఇంటర్ పస్ట్ ఇయర్ విద్యార్థి ప్రాణాలు తీసుకుంది. గుంటూరు జిల్లా పిడిగురాళ్ల జూలకల్లులో పురుగులమందు తాగి విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. కడప జిల్లా రాజంపేటలో పావని అనే ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది. చిత్తూరు జిల్లా పలమనేరు కొత్తపేట బోయవీదిలో మరో విద్యార్థిని తనువుచాలించింది. విద్యార్థులు ఆత్మహత్యలతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Five Inter students commit suicide in Andhra Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News