- Advertisement -
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఓ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -