Tuesday, May 14, 2024

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాఘవంపల్లి గ్రామంలో బైక్ ను కారు ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే యువకుడు దుర్మరణం చెందాడు. ప్రమాదం స్థలం వద్ద గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గూమిగూడడంతో వారిపై లారీ దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు సూరి (32), శివమ్మ(48), వలీసాబ్(52), శ్రీనివాసులు(49), రాజశేఖర్(29)గా గుర్తించారు. రెండు ఘటనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ చిన్న పెద్దయ్య పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News