Saturday, April 27, 2024

ఎపి సిఎంతో ఫ్లిప్‌కార్ట్ సిఇవొ భేటి

- Advertisement -
- Advertisement -

Flipkart CEO meets with AP CM

 

మనతెలంగాణ/హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ప్రముఖ ఇ -కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సిఇవొ కళ్యాణ్ కృష్ణమూర్తి, కంపెనీ ముఖ్య ప్రతినిధుల బృందం గురువారం నాడు భేటి ఆయ్యారు. ఎపి రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడటం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఇరువురి మధ్య విస్తృతంగా చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్‌బికెలను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గరనుంచి వారి పంటల కొనుగోలు వరకూ ఆర్‌బికెలు నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని ఈ సందర్భంగా సిఎం జగన్ ఫ్లిప్‌కార్ట్ సిఇవొకు వివరించారు. అలాగే రైతులకు పంటలకు మంచి ధరలు వచ్చేలా ఫ్లిప్ కార్ట్ దోహదపడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. వారి ఉత్పత్తులను కొనుగోలుచేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడాలని, అదేవిధంగా ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు యాప్ ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని కోరారు.

ఈక్రమంలో తాము విస్తృతపరుస్తున్న సరుకుల వ్యాపారంలో రైతులనుంచి ఉత్పతులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, ఇది ఉభయులకు ప్రయోజనమన్నారు. మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషిచేస్తామని ఫ్లిప్‌కార్డ్ సిఇవొ వివరించారు. రాష్ట్రంలో విశాఖపట్నం ఐటి, ఇకామర్స్ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు మందుకు రావాలని, విశాఖలో హై ఎండ్ స్కిల్‌యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగస్వాములు కావాలని ఎపి సిఎం ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్ సిఇవొ సానుకూలత వ్యక్తంచేశారు. ఇప్పటికే తమ భాగస్వామ్య సంస్థ వాల్‌మార్ట్ ద్వారా రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల కొనుగోలు, ఎగుమతి జరుగుతోందని.. దీన్ని మరింతగా పెంచుతామని ఫ్లిప్‌కార్ట్ సిఇవొ కళ్యాణ్ కృష్ణన్ తెలిపారు. ఎపి సిఎం జగన్‌ను కలిసిన వారిలో ఫ్లిప్‌కార్ట్ సిఇవొ కళ్యాణ్ కృష్ణమూర్తితోపాటు, సిసిఎవొ రజనీష్‌కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ తదితరులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News