Saturday, April 27, 2024

ఫ్లడ్ డ్యామేజీ, మెయింటెనెన్స్ నిధులపై చర్చ

- Advertisement -
- Advertisement -

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష

మనతెలంగాణ/ హైదరాబాద్ : పింఛన్‌లు ఇవ్వడంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా అందించే ప్రక్రియ కొనసాగేలా చూడాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అభయహస్తం, వడ్డీ లేని రుణాలు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులపై అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమీక్ష చేశారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలని మంత్రులు ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మంజూరు చేసిన ఫ్లడ్ డ్యామేజి, మెయింటెనెన్స్ నిధులు రూ.1867 కోట్ల పనుల పురోగతిపై చర్చించారు. గ్రామ పంచాయతీలకు రావలసిన పెండింగ్ బిల్లుల గురించి చర్చించారు. రాబోయే రెండు ఆర్ధిక త్రైమాసికాలకు సంబంధించిన నిధులపై అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పెన్షన్లు ఇవ్వడంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ ప్రక్రియ కొనసాగేటట్లు చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పిఆర్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News