- Advertisement -
అమరావతి: మహారాష్ట్రలోని అమరావతిలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యుత్ఘాతం వల్ల నలుగురు సిబ్బంది మరణించారు. బుధవారం మధ్యాహ్నం పోటే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కాలేజీ బిజెపి ఎంఎల్సి, మాజీమంత్రి ప్రవీణ్పోటేది. కాలేజీలో ఇనుప నిచ్చెన సాయంతో రంగులు వేస్తుండగా, నిచ్చెనకు కరెంట్ తీగలు తగిలి నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ దుర్ఘటనలో అక్షయ్సాహెబ్రావు(25), గోకుల్ శాలిక్రమ్జీ(28),ప్రశాంత్సేల్కర్ (30), సంజయ్దండ్నాయక్ (45) మృతి చెందారు.
- Advertisement -