Friday, April 26, 2024

29 నుండి గ్రూప్ 1 శిక్షణా తరగతులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రూప్1(Group 1) శిక్షణా తరగతులు హైదరాబాద్‌లోని ఓయూ కేంద్రంలో తాజా బ్యాచ్ ఈ నెల 29 నుండి ప్రారంభమవుతున్నాయి. డిగ్రీ, ఇంటర్మీడియట్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 200 మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్ కోసం గతంలో మెయిన్స్‌కు అర్హత సాధించిన , మెయిన్స్ ఉత్తీర్ణత సాధించని అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. తల్లిదండ్రుల వార్శికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారు అర్హులు. ఇంతకు ముందు మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించని టిఎస్‌పిఎస్‌సి గ్రూప్1కి మెయిటేజీ,

ఉన్నత విద్యార్హతలకు 10 శాతం మార్కులు, డిగ్రీ మార్కులకు 50 శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 20 శాతం మార్కులు ఇవ్వబడుతాయి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలతో నేరుగా బిసి స్టడీ సర్కిల్, ఓయూ క్యాంపస్‌లో సమర్పించాలని బిసి స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ కె. అలోక్ కుమార్ సూచించారు. మరిన్ని వివరాల కోసం 04024071178, 04027077929 నెంబర్లకు సంప్రదించవచ్చని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News