Tuesday, April 30, 2024

బిజెపి అధికారంలోకి వస్తే ‘ఉచిత దర్శనం’: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరానికి ‘ఉచిత దర్శనం’ కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం హామీ ఇచ్చారు. గద్వాల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ అయోధ్యకు ఉచితంగా దర్శనం కోసం పంపిస్తామని హామీ ఇచ్చి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ 70 ఏళ్లుగా జాప్యం చేసిందని ఆరోపించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడమే కాకుండా జనవరి 22న ప్రారంభోత్సవం కూడా చేస్తారని అన్నారు.

బిజెపి అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతుల (బీసీ) నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తానని పునరుద్ఘాటించారు. రాష్ట్ర జనాభాలో బిసిలు 52 శాతం ఉండగా, 135 బిసి వర్గాలు ఉన్నా బిసి ముఖ్యమంత్రి లేడన్నారు. బిసిలకు టికెట్లు ఇవ్వడంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ అన్యాయం చేశాయని ఆరోపించారు. బీసీలకు అత్యధిక టికెట్లు ఇచ్చింది బిజెపియేనని తెలిపారు.

నరేంద్రమోడీ రూపంలో భారత్‌కు తొలి బిసి ప్రధానిని ఇచ్చింది బిజెపి.. మోడీ ప్రభుత్వంలో బిసిలకు చెందిన 27 మంది మంత్రులు ఉన్నారని.. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ బిసిలకు వ్యతిరేకమని అమిత్‌ షా అన్నారు. బిసిల సంక్షేమానికి భాజపా మాత్రమే భరోసా ఇస్తుందని, తెలంగాణలో వచ్చే ఎన్నికలు ఐదేళ్ల తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తాయని కేంద్ర హోంమంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News