Friday, April 26, 2024

నర్సంపేట నియోజకవర్గంలో బిటి రోడ్లకు మహర్దశ..

- Advertisement -
- Advertisement -

వరంగల్: నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ మండల కేంద్రాల నుండి ఉన్న ప్రధాన రహదారులన్నింటిని మరమ్మతులు చేయడంతో పాటు కొత్త రోడ్లను, బ్రిడ్జిలను మంజూరు చేశారు. గత సంవత్సరంలో నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా అత్యధిక వర్షాలు కురవడం వలన రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఈ రోడ్లకు మరమ్మతులు చేయడంతోపాటు నూతన రోడ్ల నిర్మాణాలను కూడా చేపట్టడానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చోరువతో నిధులను మంజూరు చేయించారు.

 ఆర్ఆండ్ బి శాఖ ద్వారా మంజూరు కాబడిన రోడ్ల వివరాలు:

1. నెక్కొండ నుండి ఇనుగుర్తి వరకు (వయా సాయిరెడ్డిపల్లి) రూ.12 కోట్లు.

2. నర్సంపేట నుండి నెక్కొండ వరకు రూ.6 కోట్ల 70 లక్షలు.

3. నర్సంపేట నుండి వరంగల్ వరకు రూ.5 కోట్ల 32 లక్షలు.

4. నెక్కొండ నుండి ఇంటికన్నే వరకు రూ.2 కోట్ల 48 లక్షలు.

5. చెన్నరావుపేట నుండి గుండెంగ వరకు (వయా పాపయ్యపేట) రూ.2 కోట్ల 46 లక్షలు.

6. నర్సంపేట నుండి నల్లబెల్లి వరకు (వయా మాదన్నపేట) రూ.96 లక్షలు

7. చెన్నరావుపేట నుండి ఉప్పరపల్లి వరకు నూతన (CC) రోడ్ రూ.2 కోట్ల 50 లక్షలు.

8. పనికర నుండి మాచ్చాపూర్ వరకు (వయా దీక్షకుంట) రూ.2 కోట్ల 38 లక్షలు.

9. జల్లి నుండి లింగగిరి వరకు రూ.1 కోటి 50 లక్షలు.

10. మహ్మద్ గౌసుపల్లి, నందిగామ గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.2 కోట్ల 10 లక్షలు.

11. మహ్మద్ గౌసుపల్లి, నందిగామ గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.1 కోటి 90 లక్షలు.

నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు నిర్మాణ పనులకోసం ఈ రోజు రూ.40 కోట్ల 30 లక్షలు మంజూరు చేయించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News