కోల్కతా: హాథ్రస్లో దళిత యువతికి జరిగిన అంత్యక్రియల తీరు రామాయణంలోని సీత అగ్ని ప్రవేశాన్ని గుర్తు చేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ అన్నారు. బాధితురాలి పట్ల జరిగిన క్రూర చర్యలను ఖండించేందుకు మాటలు రావడం లేదని మమత ట్విట్ చేశారు. బాధితురాలి కుటుంబానికి మమత సంతాపం తెలిపారు. అత్యాచారానికి గురైన బాధితురాలి పట్ల యుపిలోని బిజెపి ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుపట్టారు. కుటుంబసభ్యులు లేకుండా అంత్యక్రియలు నిర్వహించినందుకు సిగ్గుపడాలని ఆమె విమర్శించారు. మమత వ్యాఖ్యల్ని బెంగాల్ బిజెపి నేతలు ఖండించారు. మమతాబెనర్జీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ఘోష్ విమర్శించారు. టిఎంసి నేతలు మొసలి కన్నీరు ఆపాలని ఆయన అన్నారు. మమత పాలనలో బెంగాల్లో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆయన దుయ్యబట్టారు. అలాంటి ఘటనలే బెంగాల్లో జరుగుతున్నపుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.