లక్నో: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఢిల్లీ అమ్మాయి ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మోరాదాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఢిల్లీలో మిథాపూర్కు చెందిన ఓ అమ్మాయికి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అమ్మాయి డిగ్రీ వరకు పూర్తి చేసి జాబ్ లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటుంది. ఎఫ్బిలో పరిచయమైన తాను ఆన్లైన్ ఎక్స్పోర్టు కంపెనీ మేనేజర్గా పని చేస్తున్నానని, ఆమెకు జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. మోరాదాబాద్కు ఇంటర్వూకు రావాలని ఆమ్మాయికి కబురు పంపాడు. శనివారం అమ్మాయి ఢిల్లీ నుంచి యుపిలోని మోరాదాబాద్కు చేరుకుంది. అమ్మాయిని బుధ్ విహార్ నగర్లోని ఓ హోటల్కు తీసుకెళ్లి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. అమ్మాయి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెపై ఇద్దరు అత్యాచారం చేసి పారిపోయారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి హోటల్కు విచారణ జరిపారు. హోటల్ సిబ్బంది నిందితుల సమాచారం ఇవ్వలేదు. దీంతో సిసిటివి ఫూటేజీ ఆధారంగా నిందితుల పేర్లు రాజా, ఇతాశామ్గా గుర్తించారు. లవ్ జిహాద్ కింద కేసు నమోదు చేయాలని బాధితురాలు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
జాబ్ ఇప్పిస్తానని చెప్పి యువతిపై అఘాయిత్యం…
- Advertisement -
- Advertisement -
- Advertisement -