Tuesday, April 30, 2024

రామ్‌కోఠిలో వ్యాన్ ఢీకొనడంతో జిహెచ్‌ఎంసి కార్మికురాలు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాలేజీ వ్యాను ఢీకొని జిహెచ్‌ఎంసి కార్మికురాలు మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని రామ్‌కోఠిలో జరిగింది. రోడ్డు ఊడుస్తున్న కార్మికురాలిని వ్యాను ఢీకొట్టడంతో జిహెచ్‌ఎంసి కార్మికురాలు సునీత(35) ఘటనా స్థలంలోనే చనిపోయింది. కార్మికురాలిని అయాన్ వైద్య కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలుకు ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలని జిహెచ్‌ఎంసి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

Also Read: క్రేజీ కాంబినేషన్‌లో ‘తమ్ముడు’ షురూ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News