Sunday, April 28, 2024

కలుస్తాలేడని బాయ్ ఫ్రెండ్ పై కాల్పులు జరిపి…

- Advertisement -
- Advertisement -

Girl friend shoot on boy friend in West bengal

కోల్‌కతా: ఒకే గ్రామానికి చెందిన యువతి, యువకుడు పేమించుకున్నారు. నాలుగేండ్లు కలిసి తిరిగారు. ఆమెకు ఉద్యోగం రావడంతో వేరే ప్రాంతానికి వెళ్లింది. దీంతో అతడు ఆమెను దూరం పెట్టాడు. రోజులు గడుస్తున్న ఆమెను అతడు పట్టించుకోకపోవడంతో తన బాయ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి కలుద్దామని తెలిపింది. బాయ్ ఫ్రెండ్ రాగానే అతడిపై ఆమె కాల్పులు జరిపింది. బుల్లెట్ గురితప్పడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన సంఘటన పశ్చిమబెంగాల్‌లోని పూర్వ బర్ధమాన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేషియా గ్రామంలో ఓ యువతి, యువకుడు నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమెకు ఉద్యోగం రావడంతో జార్ఖండ్ వెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరు మధ్య దూరం పెరిగింది. అతడు ఆమెను పట్టించుకోకపోవడంతో కోపం పెంచుకుంది. బాయ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి కలుద్దామని తెలిపింది. బుధవారం ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కౌగిట్లో ఒకరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ముద్దుల వర్షం కురిపించారు. ఇద్దరు కలిసి సిగరెట్ తాగిన అనంతరం అతడిపై ఆమె తుపాకీతో కాల్పులు జరిపింది. బుల్లెట్లు కడుపుభాగంలో దూసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఘటనా స్థలం నుంచి యువతి పారిపోయింది. స్థానికులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News