Sunday, April 28, 2024

గచ్చిబౌలిలో భవనం పైనుంచి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man Fell In Pond And Died In Medak
గచ్చిబౌలి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హాస్టల్ భవన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతం టెలికమ్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… క్యాప్ జెమినీ సంస్థలో సురేందర్ రెడ్డి(30) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పని చేస్తున్నాడు. టెలికామ్ నగర్‌లోని హాస్టల్ ఉంటున్నాడు. బుధవారం అర్థరాత్రి సమయంలో పూటుగా మద్యం తాగి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చిన తరువాత అతను మౌనంగా ఉండడంతో వెళ్లిపోయారు. బుధవారం అర్థరాత్రి సమయంలో  హాస్టల్ భవనం ఆరో అంతస్తు పైనుంచి దూకాడు. వెంటనే అంబులెన్స్‌లో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎపిలోని ఒంగోలు చెందిన వ్యక్తిగా గుర్తించామని, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని రాయదుర్గం సిఐ తిరుపతి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News