అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్న గవర్నర్
హైదరాబాద్: సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. అపోలో వైద్యులకు ఫోన్ చేసి గవర్నర్ తమిళిసై రజనీకాంత్ ఆరోగ్యం గురించి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో హైబిపితో జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో రజనీకాంత్కు చికిత్స కొనసాగుతోంది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని అపోలో యాజమాన్యం తెలిపింది. నేడు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని, హైబిపి పెరగడంతో చిత్ర యూనిట్ ఆస్పత్రికి షిఫ్ట్ చేసిందని వైద్యులు తెలిపారు. ఇంటర్నేషనల్ సూట్లోని ప్రత్యేక రూంలో అపోలో వైద్యులు రజనీకాంత్కు వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే చెన్నై నుంచి హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి రజనీకాంత్ వ్యక్తిగత వైద్యులు చేరుకున్నారు.
Governor Tamilisai enquired about the health of rajinikanth