Saturday, May 18, 2024

గంటలో పెళ్లి… పారిపోయిన వరుడు… కానీ..

- Advertisement -
- Advertisement -

Groom escaped from marriage mandapam

అమరావతి: పెళ్లికి గంట ముందు వరుడు పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగింది. పోలీసులు వరుడిని పట్టుకొచ్చి సదరు యువతితో పెళ్లి జరిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనిల్ అనే యువకుడికి ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. రెండు కుటుంబాల సభ్యులు అంగరంగా వైభవంగా పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 21 పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి మండపానికి బంధువులు స్నేహితులు, వరుడు, వధువు అందరూ చేరుకున్నారు. పెళ్లి ముహూర్తానికి గంట ముందు వరుడు గోడ దూకి పారిపోయాడు. వెంటనే వరుడు కనిపించకపోవడం వధువు కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయవాడ నుంచి వరుడు హైదరాబాద్‌కు బస్సులో పారిపోయాడు. పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారని తెలుసుకొని హైదరాబాద్ నుంచి విజయవాడకు వెనుదిరిగాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అనిల్‌ను ట్రాక్ చేసి నందిగామ అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. అదే మండపంలో అదే యువతితో అనిల్‌కు పెళ్లి చేసుకున్నారు. చివరలో శుభం కార్డు పడడంతో ఇరు కుటుంబాలు సంతోషంవ్యక్తం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News