Friday, April 26, 2024

కార్యకర్త పాడె మోసిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

harish rao attending funeral of trs activist in in Dubbaka

సిద్దిపేట: నువ్వా నేనా అన్నట్టు జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ ఓటమితో దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లికి చెందిన కొత్తింటి స్వామి అనే కార్యకర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్ రావు స్వామికి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో ఎంపి కొత్తప్రభాకర్ రెడ్డితో కలిసి స్వామి పాడె మోశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరుపున రూ.2లక్షల సాయం అందించారు. భవిష్యత్తులో ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్వామి పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్ లో తల్లి కోరుకున్న విధంగా చదివిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

harish rao attending funeral of trs activist in in Dubbaka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News