Monday, May 6, 2024

ప్రత్యామ్నాయంతోనే అధిక లాభాలు: రైతులకు హరీశ్ రావు సూచన

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూర్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్ కు అనుగుణంగా రైతులు మారాలని, రైతులు సంఘటితంగా మారి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు గడించవచ్చునని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎఫ్ పిఓ కార్యక్రమాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని, రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే ఎఫ్ పిఓ ఉద్దేశ్యమని మంత్రి చెప్పారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలో శనివారం ఉదయం రైతు వేదిక ప్రారంభించి, అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు ప్రోత్సాహం, భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో చిన్నకోడూర్ మండలంలోని మాచాపూర్, చౌడరం గ్రామాల్లో సభ్యత్వం పొందిన 750 మంది రైతులకు సన్ ఫ్లవర్ సీడ్ విత్తనాలు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
పంట మార్పిడి విధానంలో భాగంగా చిన్నకోడూర్ మండలంలో వెయ్యి ఎకరాలకు పొద్దు తిరుగుడు విత్తనాన్ని మారుస్తున్నట్లు.. దీంతో రైతులకు నేరుగా మద్దత్తు ధర రావడంతో పాటు వచ్చిన ఉత్పత్తితో ఆదాయాన్ని తిరిగి ఇచ్చే వెసులుబాటు ఉందని తెలిపారు. పొద్దు తిరుగుడు పువ్వు తేనేటీగల ఉత్పత్తి ద్వారా కలిగే లాభాల గురించి 700 మంది రైతులకు విడతల వారీగా రైతు వేదికలో రోజూ శిక్షణ జరపాలని ఆయా సంస్థ శాస్త్రవేత్తలు, ప్రతినిధులను మంత్రి కోరారు. ఈ యాసంగిలో సన్ ఫ్లవర్ పంటలకు మంచి దిగుబడి వస్తదని శాస్త్రవేత్తలు రైతులను చైతన్య పర్చాలని కోరారు.

నూనె ఉత్పత్తులు, పప్పు దినుసుల పంటలు పండించాలని రైతులను కోరుతూ.. చిన్నకోడూర్ మండలంలో ఎఫ్ పిఓ వెయ్యి ఎకరాలకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం ఓ వరం అని మంత్రి అన్నారు.ఇక, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని లేఖ రాసిందని, సీఎం కేసీఆర్ 3సార్లు ఢిల్లీకి వెళ్లి వడ్ల విషయంలో చర్చించి వచ్చారని, అయినా మార్పు రాలేదని తెలిపారు. ఎఫ్ సిఐ 4 ఏండ్లకు సరిపడే ధాన్యం నిండిందని ఈ యాసంగికి వడ్లు కొనమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. ఎఫ్ సిఐ ఉంపుడు బియ్యం కొనే పరిస్థితి లేదని ఈ సమస్య దేశ వ్యాప్తంగా మారిందని కేంద్రం తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

Harish Rao comments on Paddy Procurment 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News