Sunday, April 28, 2024

ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మీ రుణం తీర్చుకుంటం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హుజూరాబాద్: తనకు అన్నం పెట్టిన ఊరు, ఆతిధ్యం ఇచ్చిన ఊరు సింగాపురమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని సింగాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”నాకు కాని, సిఎం కెసిఆర్ కు గాని ఆతిధ్యం ఇ్చచిన ఊరు సంగాపురం. గెల్లు శ్రీనుకు మీ ఆశీర్వాదం ఇవ్వండి, ఇంకా కష్టపడి పని చేస్తాం. మీ రుణం తీర్చుకుంటం. అబద్దాల బీజేపీ మాటలు నమ్మవద్దు. బీజేపీ గెల్చేదిలేదు. ప్రభుత్వం వచ్చేది లేదు. మంత్రి అయ్యేది లేదు. ధరలు పెంచిన బీజేపీ మనకు ఎందుకు. కళ్యాణ లక్ష్మీ, కెసిఆర్ కిట్, రైతుంబంధు పథకాలు కడుపు నింపవని.. ఆసరా పెన్షన్ పరిగ ఎరుకున్నట్లేనని రాజేందర్ అంటుండు.నీవు శ్రీమంతుడవి నీకు అవసరం లేకపోవచ్చు రాజేందర్, కాని ఓ అవ్వకు కొండంత ఆత్మవిశ్వాసం కల్పించింది. బీజేపీ, ఈటల రాజేందర్ హుజూరాబాద్ కు ఎం చేశారని ఓట్లు అడుగుతున్నారు” అని మంత్రి హరీశ్ మండిపడ్డారు.

Harish Rao Election Campaign in Singapuram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News