Monday, April 29, 2024

సద్ది తిన్న రేవు తలవాలి.. సిఎం కెసిఆర్ ను ఆశీర్వదించాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మెదక్: సద్ది తిన్న రేవు తలవాలి.. పనిచేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆశీర్వదించాలి అని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలోని తూప్రాన్ పర్యటంలో భాగంగా బుధవారం మనోహరాబాదులో నూతనంగా నిర్మించిన పీహెచ్ సిని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..

“మనోహరాబాద్ లో పీహెచ్ సీ ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనోహరాబాద్ మండలం చేయాలని దశాబ్దల కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారు. ఈరోజు మనోహరాబాద్ మండలమైంది ఈ మండలంలో 24 గంటలు పనిచేసే పీహెచ్ సీ ప్రారంభించుకుంటున్నాం. ఉచితంగా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. గర్భిణీలకు చెకప్ లు కూడా ఇక్కడ జరుగుతాయి. కేసీఆర్ సిఎం కాకపోతే మనోహరాబాద్ మండలం అయ్యేదా?, ఇక్కడ ఇంతటి అభివృద్ధి జరిగేదా?. త్వరలో మనోహరాబాద్ కి పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తాం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిల్లో 76% డెలివరీలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ తెచ్చి డెలివరీ అయ్యాక ఆటోలో ఇంటి దగ్గర దింపుతున్నాం. ఈరోజు పేద ప్రజల కష్టాలు అర్థం చేసుకుని కష్టాలు తీరుస్తున్న నాయకుడు సిఎం కెసిఆర్. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు పారుతుంది అంటే కేసీఆర్ కృషివల్లే సాధ్యమైంది. తాగడానికి మంచినీళ్లు లేనటువంటి ప్రాంతంలో ఈరోజు ప్రతి ఇంటికి నీళ్లు వచ్చాయంటే కేసీఆర్ కృషివల్లే. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తామంటే నమ్ముతారా?. ఈరోజు కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతుకు విలువ పెరిగింది.. భూమికి ధర పెరిగింది” అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News