Friday, May 3, 2024

‘మేజర్’కు హృదయపూర్వక నివాళిగా…

- Advertisement -
- Advertisement -

Heart fell tribute to Major

నటుడు అడివి శేష్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ మే 27న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడింది. మంగళవారం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా చిత్ర బృందం హృదయపూర్వకమైన నివాళిగా అతని జీవితంపై రూపొందించిన వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియో కేవలం మేజర్ జీవితంలోని వివిధ దశలను చూపడమే కాకుండా, ఆ పాత్రను అడివి శేష్‌తో చిత్రీకరించిన మరపురాని సంఘటనలను కూడా చూపుతుంది. ఇందులో మేజర్‌కి తన తల్లితో ఉన్న ఆప్యాయత, సోదరితో అతని బంధం, స్నేహితులతో గడిపిన అత్యుత్తమ క్షణాలు, శిక్షణా రోజులు, చివరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లో అధికారిగా అతని అనుభవాలను వివరిస్తుంది. చివరి వరకు ఫొటోలలో మేజర్‌లోనూ, శేష్‌లోనూ మనకు పెద్దగా తేడాలు కనిపించవు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా ఈ వీడియో ఒక సంపూర్ణ నివాళిగా నిలుస్తుంది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రముఖ తారాగణంగా నటించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా నిర్మించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News