- Advertisement -
హైదరాబాద్: వ్యవసాయ రంగంలో సిఎం కెసిఆర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, అందిస్తున్నామన్నారు. కాళేశ్వరం జలాలతో భూమికి బరువయ్యే పంట పండిందని, యాసంగిలో రికార్డు స్థాయిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇక నుంచి రైతులు వర్షాల కోసం ఎదురు చూడకుండా, కాళేశ్వరంతో చెరువుల్లో నిండిన గోదావరి జలాలతో సాగు చేసుకోవచ్చన్నారు. రైతుల పండించిన పంటలపై చర్చించుకునేందుకు రైతు వేదికలు ఉపయోగపడుతాయని, రైతు శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి కెసిఆర్ అని పొగిడారు.
- Advertisement -