- Advertisement -
చెన్నై: భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అయ్యింది. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో 24 గంటలపాటు తమిళనాడులోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరులో అతిభారీ వర్షాలు కురుస్తాయని కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెన్నైకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Heavy Rains in Tamil Nadu for next 24 hours
- Advertisement -