Sunday, April 28, 2024

‘అవినీతి మచ్చ’పడిన వ్యక్తికి అందలమా..?

- Advertisement -
- Advertisement -

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ మహేందర్‌రెడ్డిని తొలగించి, న్యాయవిచారణ జరిపించాలి : ఎంఎల్‌సి కవిత

మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను తప్పించాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత డి మాండ్ చేశారు. మహేందర్ రెడ్డి రూ. లక్ష కోట్ల మేర అ క్రమార్జన చేశారని అవినీతి ఆరోపణలు వచ్చాయని, తక్షణ మే ఆయనను టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ పదవి నుంచి తప్పించి జ్యుడిషియల్ విచారణ జరపించాలని అన్నారు. త్వరలో తా ము ఈ అంశంపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందిస్తామ నివెల్లడించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తెలంగాణ యువతకు ఎలా న్యాయం చేయగలుగుతారని ప్రశ్నించా రు. గురువారం నా డు తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎం ఎల్‌సి కవత మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పటి సిఎం రేవంత్ రెడ్డి అప్పుడు ముందున్నారని, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేశారని గుర్తు చే శారు. ఆ క్రమంలో బిఆర్‌ఎస్ హయాంలో డిజిపిగా ఉన్న మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఉచ్ఛరించడానికి వీలులేని భాషలో ప్రభుత్వంలో ఐదేళ్లు డిజిపిగా పనిచేసిన వ్యక్తిని టిఎస్‌పిఎస్‌సి  చైర్మన్‌గా నియమించారని అన్నారు. రిటైర్డ్ అధికారులను కెసిఆర్ ఆయా పోస్టుల్లో నియమిస్తే విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పనిచేస్తున్నదని మండిపడ్డారు. టిఎస్‌పిఎస్‌సి సభ్యుడిగా నియమించిన వై రామ్మోహన్ రావు తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలో ఆంధ్ర వ్యక్తిని నియమిస్తే సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా..? అన్నది సిఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉన్న వారిని సభ్యులుగా నియమించబోమని చెప్పి న సిఎం టిడిపిలో పనిచేసిన రజని కుమారిని ఎలా నియమించారు…? అని ప్రశ్నించారు.
గతంలో కెసిఆర్ నోటిఫై చేసిన ఉద్యోగాలను ఇస్తున్నారు
స్టాఫ్‌నర్స్, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపట్టడంతో పాటు మినీ అంగన్ వాడీలను బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అప్‌గ్రేడ్ చేసిందని, కానీ ఇప్పుడు తాము నియామకపత్రాలు ఇస్తామంటున్నారని ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. కెసిఆర్ చేసిన పనులు తామే చేస్తున్నామని చెప్పకుంటుంటే ఇక ప్రజలు అధికారం ఎందుకిచ్చినట్లు అని అడిగారు. ప్రజలు అధికారమిచ్చినప్పుడు కొత్త పనులు, ప్రజలకు పనికివచ్చే పనులు చేయాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబరులోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేవలం 60 మాత్రమే కొత్త ఉద్యోగాలను నోటిఫై చేసిందని ప్రస్తావించారు.
గతంలో కెసిఆర్ నోటిఫై చేసిన ఉద్యోగాలను ఇప్పుడు ఇస్తున్నారని చెప్పారు. చేయని పనులు చేస్తున్నామని చెప్పడం మానేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చిన వారికి నియామక పత్రాలను సిఎం రేవంత్ రెడ్డి అందించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీయే డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేసిందని, అందుకు అంగీకరిస్తూ ఐఎన్‌టియుసి సంతకాలతో ఎఐటియుసి సంతకాలు చేశాయని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించిన కెసిఆర్ …. ఒక్కసారి కూడా నియామక పత్రాలు అందించలేదని, ఇది కేవలం సాధారణంగా జరిగే ప్రక్రియగా భావించి జనరల్ మేనేజర్ స్థాయిలో నియామక పత్రాలు ఇచ్చేవారని అన్నారు. జిఎం స్థాయిలో జరిగే పనిని హైదరాబాద్‌లో సిఎం స్థాయిలో నియమకా పత్రా లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కొత్తగా 400 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా నిజాలు చెప్పాలని సూచించారు. కెసిఆర్ సింగరేణిని కన్నతల్లిలా చూశారని, సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించారని, ఉద్యోగుల సంఖ్య పెరగాలని చూశారని వివరించారు. రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు హయాంలో సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చి ఉద్యోగులను తొలగించి సంఖ్యను కుదించారని అన్నారు. కాబట్టి అబద్దాలు చెప్పడం మానేసి కొత్తగా వేసిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలి అని కవిత డిమాండ్ చేశారు. అత్యంత కీలకమైన విద్యుత్తు సంస్థలో నలుగురు డైరెక్టర్లను ప్రభుత్వం నియమిస్తే అందులో ముగ్గురు ఆంధ్రా అధికారులే ఉన్నారని కవిత మండిపడ్డారు. నందకుమార్, నర్సింహులు, సుధా మాధూరిని డైరెక్టర్లుగా నియమించారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురు సీనియర్ అధికారులను పక్కనబెట్టి ధర్మాధికారి కమిషన్ నివేదికను సాకుగా చూపించి ఆంధ్ర వాళ్లను నియమించారని, తెలంగాణ ప్రయోజనాలపై వాళ్లకు ఏం ఆసక్తి ఉంటుందని ప్రశ్నించారు. కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు ఒక్క నిమిషమైనా కరెంటు పోయిందా..? హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకున్న దగ్గర మూడు, నాలుగు గంటలు కరెంటు పోతుందంటే… దీని వెనుక ఆంధ్రా కుట్ర లేదా..? అని ప్రశ్నించారు. మీలో ఉన్న పచ్చరక్తం మీ చేత ఈ పని చేపించడం లేదా..? అని మండిపడ్డారు. ఈ ముగ్గురు డైరెక్టర్లను తొలగిం చి వారి స్థానంలో తెలంగాణ వారిని నియమించాలని డిమాండ్ చేశారు.
వ్యక్తిగత న్యాయవాదులను కోర్టుల్లో నియమించారు
ప్రభుత్వానికి సలహాదారులే ఉండవద్దని కోర్టుల్లో కేసులు వేసిన రేవంత్ రెడ్డి …. ఇవాళ ఎంత మందిని సలహాదారులుగా నియమించుకున్నారో చెప్పాలని ఎంఎల్‌సి కవిత అడిగారు. రాజకీయ నాయకులను సలహాదారుగా నియమించుకుంటే ఏదో అనుకోవచ్చు కానీ ఢిల్లీలో ఒక మాజీ న్యాయమూర్తి వద్ద పనిచేసిన వ్యక్తిని, లేని కొత్త పోస్టును సృష్టించి అసెంబ్లీకి సలహాదారునిగా నియమించడమేంటి.? అని ప్రశ్నించారు. వ్యక్తిగత కేసులు, ఓటుకు నోటు కేసులో వాదించిన దేవనా సైగల్‌ను సుప్రీం కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, తేర రజినీకాంత్ రెడ్డిని అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమించారని పేర్కొన్నారు. అలాగే కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఆపడానికి దొంగ కేసులు వేసిన ఒక న్యాయవాదిని సుప్రీం కోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డుగా నియమించడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో తటస్థతంగా పనిచేసే న్యాయవాదులు ఎవరూ లేరా..? అని నిలదీశారు. వ్యక్తిగత బృందాన్ని కోర్టుల్లో నియమించడం అధికార దుర్వినియోగం చేయడమేనని తేల్చిచెప్పారు.
రాష్ట్ర గీతం, జెండా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, రాష్ట్ర గీతంపై విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత సమాధానమిస్తూ…. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా హృదయంపై చేయి వేసుకొని జై తెలంగాణ అంటే ఇవన్నీ చేసే అర్హత ఉంటుందని, కానీ ఎప్పుడూ జై తెలంగాణ అని అనని వ్యక్తి తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం హాస్యాస్పందగా ఉందని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం తనలాగా ఉందని సిఎం అంటున్నారని, తానూ తెలంగాణ ఆడబిడ్డనే కదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలు తనలాగే ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్ర గీతం, జెండా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదని, రెండు రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తే సుప్రీం కోర్టు కూడా అనుమతి ఇవ్వలేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News