- Advertisement -
కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం
బెళగావి : టివి, ఫ్రిజ్, ద్విచక్రవాహనం వంటి వస్తువులున్న వారు రేషన్ కార్డు వదులు కోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి వస్తువులున్నవారు ప్రభుత్వం మంజూరు చేసే రేషన్కు అర్హులు కారని ఆ రాష్ట్ర ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ఉమేశ్ కత్తి మీడియా సమావేశంలో తెలిపారు. అలాగే మరికొన్ని పరిమితులను వివరించారు. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండరాదని, వార్షికాదాయం రూ.1.20 లక్షల కంటే ఎక్కువ ఉండరాదని చెప్పారు. ఇవి ఉన్న రేషన్ కార్డుదారులు మార్చి 31 లోగా కార్డులను తిరిగి వాపసు చేయాలని అలా చేయకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రం లోని రేషన్దుకాణాల ఎదుట ఆందోళన చేపట్టింది.
- Advertisement -