ముంబయి: 16 ఏళ్ల అమ్మాయి యువకుడితో ప్రేమలో పడిందని సోదరుడు ఆమెను చంపి అడవిలో పడేయడంతో నక్కలు, కుక్కలు మృతదేహాన్ని పీక్కతిన్న సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో జరిగింది. సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డెగ్లూర్ జిల్లా ధమాగామ్ గ్రామంలో కల్పన సూర్యవంశీ అనే అమ్మాయికి అనిల్ సూర్యవంశీ అనే సోదరుడు ఉన్నాడు. కల్పన్ స్థానిక యువకుడితో ప్రేమలో పడడంతో పాటు అతడితో తిరుగుతుండడంతో కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఆమెలో మార్పురాకపోవడంతో తన పరువు పోతుందని కుటుంబ సభ్యులు భావించారు. వెంటనే జూన్ 20న అనిల్ తన సోదరి కల్పనను చంపి అనంతరం గ్రామ శివారులో మృతదేహాన్ని పడేశాడు. జూన్ 22న స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని కుక్క, నక్కలు సగం పీక్కతిన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాం కల్పనదిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమె లవరే తన కూతురుని చంపి ఉంటాడని పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల నుంచి కూతురు కనిపించకపోతే ఫిర్యాదు ఎందుకు చేయలేదని కుటుంబ సభ్యులపై పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే మర్డర్ చేశానని అనిల్ ఒప్పుకున్నాడు. వెంటనే అనిల్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
పరువు హత్య…. మృతదేహాన్ని సగం పీక్కతిన్న నక్కలు…
- Advertisement -
- Advertisement -
- Advertisement -