Friday, May 3, 2024

అరవింద్…. నిజామాబాద్ కు ఎన్ని నిధులు తెచ్చావు: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

How many funds for Nizamabad

 

హైదరాబాద్: అరవింద్ ఫేక్ ఎంపి అని, పసుపు బోర్డ్ తెస్తానని చెప్పి మాట తప్పారని ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి విమర్శించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి గోడలు కూలగొడతానని అరవింద్ అనడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అరవింద్‌ను ప్రజలు ఎంపిగా గెలిపించింది అభవృద్ధి కోసమన్నారు. ఎంపి అరవింద్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తన సొంత అన్న సంజయ్ ఎలాంటి బంధుత్వం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో విలేకరులను గన్‌తో బెదిరించిన వ్యక్తి ఎంపి అరవింద్ అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపి అరవింద్‌పై ప్రధాని నరేంద్ర మోడీకి వినతి పత్రాన్ని పంపిస్తామన్నారు. కేంద్రం నుంచి నిజామాబాద్‌కు అరవింద్ ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని నిలదీశారు. నిజామాబాద్ జిల్లాకు పట్టిన శని ఎంపి అరవింద్ అని దుయ్యబట్టారు. ప్రజలు లేని యాత్ర బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News