Tuesday, April 30, 2024

జలం.. కాపాడుకుందాం

- Advertisement -
- Advertisement -

భూమిపై సమృద్ధిగా నీరు లభిస్తోంది. నీరు దీని అణువు రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ అణువుతో రూపొందించబడింది. మహా సముద్రాల ద్వారా భూమి ఉపరితలంలో మూడు వంతులు ఆవహించి ఉంది. సమృద్ధి ఉన్నప్పటికీ నేడు దాని లభ్యత ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఐక్యరాజ్యసమితి (యుఎన్) ప్రకారం సుమారు 2.2 బిలియన్ల మందికి ఇప్పటికీ సురక్షిత నీరు అందుబాటులో లేదు. అంటే 115 మిలియన్ల మంది కలుషిత నీటినే తాగాల్సిన దుస్థితి ఏర్పడింది. వాతావరణ మార్పులు, ప్రపంచ జనాభా పెరుగుతున్న వేళ నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సైనికుడిలా పరిశ్రమించాల్సిన అవసరం ఉంది. 2030 నాటికి ప్రపంచ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి చర్యలు చేపడుతోంది.

జలంతోనే జనజీవనం. మనిషి జీవితంలో నీరు ప్రధాన వనరు. తాగడం, వంట చేయడం, స్నానం ఇలా దైనందిన జీవనంలో దీని స్థానం భర్తీ చేయలేనిది. ఆరోగ్యకరమైన జీవన శైలి ఏర్పాటులో కూడా సహజ వనరుగా లభించే నీరే ప్రధాన పాత్ర పోషిస్తోంది. మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేలా చేసే జల లభ్యత రానురాను తగ్గిపోతోంది. వినియోగం పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వాతావరణ మార్పులు, మండే ఎండలతో నీరు అందని పరిస్థితి ఏర్పడుతోంది. భూగర్భ జలాలను సంరక్షించుకోవడం అందరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటి పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి 1993లో మార్చి 22ని ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది నీటి దినోత్సవం నిర్వహించి మంచి నీటి ప్రాముఖ్యతను, ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న కొరతపై చర్చిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2.2 బిలియన్ల మందికి ఇప్పటికీ సురక్షిత నీరు అందుబాటులో లేదంటే రానున్న తరాల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళన కలిగిస్తోంది. భూమిపై సహజ వనరుగా ఉండే నీరు మానవులతో పాటు సమస్త ప్రాణకోటికి ఆధారంగా ఉంది. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలకు నీరు ఎంతో అవసరం. అయితే సహజ సిద్ధంగా లభించే నీటి నిర్వహణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. కొరత, కాలుష్యం, అధిక వినియోగం వంటివి ఉన్నాయి.ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకునే ప్రపంచ నీటి దినోత్సవం, ప్రజల ఆరోగ్యం, పర్యావరణం కోసం ఈ కీలక వనరును సంరక్షించడం, రక్షించడం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. నీటి నిర్వహణ పద్ధతులు, అవలంబించాల్సిన అవసరాన్ని ప్రతిబింబించేలా అవగాహన పెంచుకోవడానికి ఇది ఒక అవకాశం.మన విశ్వంలో నీరు ఒకటి. వ్యక్తిగత కణాల నుండి మొత్తం పర్యావరణ వ్యవస్థల వరకు అన్ని స్థాయిలలో జీవితానికి ఇది ఎంతో అవసరం.

మైక్రోస్కోపిక్ స్థాయిలో, జీవులు తమశరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, ఆర్ద్రీకరణను నిర్వహించడానికి, వారి మనుగడకు కీలకమైన శారీరక ప్రక్రియలకు నీటిపై ఆధారపడి ఉంటాయి. మానవుడి అభివృద్ధి, పరిణామంలో నీరు ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. నాగరికులు వ్యవసాయం, పరిశుభ్రత, రవాణా, ఆహార ఉత్పత్తి కోసం వారి ఆస్తుల ప్రయోజనాన్ని పొందడానికి మంచినీటి వనరుల సమీపంలో స్థిరపడేందుకు ప్రయత్నించాయి. అప్పటి నుంచి ప్రజల దైనందిన జీవితాలు ఎల్లప్పుడూ నీటి చుట్టూ తిరుగుతాయి, ఇది మానవ పురోగతికి ప్రధాన వనరుగా మారింది. భూమిపై సమృద్ధిగా నీరు లభిస్తోంది. నీరు దీని అణువు రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ అణువుతో రూపొందించబడింది. మహా సముద్రాల ద్వారా భూమి ఉపరితలంలో మూడు వంతులు ఆవహించి ఉంది.

సమృద్ధి ఉన్నప్పటికీ నేడు దాని లభ్యత ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఐక్యరాజ్యసమితి (యుఎన్) ప్రకారం సుమారు 2.2 బిలియన్ల మందికి ఇప్పటికీ సురక్షిత నీరు అందుబాటులో లేదు. అంటే 115 మిలియన్ల మంది కలుషిత నీటినే తాగాల్సిన దుస్థితి ఏర్పడింది. వాతావరణ మార్పులు, ప్రపంచ జనాభా పెరుగుతున్న వేళ నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సైనికుడిలా పరిశ్రమించాల్సిన అవసరం ఉంది. 2030 నాటికి ప్రపంచ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి చర్యలు చేపడుతోంది.

బెంగళూరులో అపూర్వమైన నీటి సంక్షోభం మధ్య హోలీ జరుపుకోవడానికి పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లకు కావేరి, బోర్‌వెల్ నీటిని ఉపయోగించవద్దని నగర నీటి బోర్డు ఆదేశాలు జారీ చేసింది. భూగర్భ జలాల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టిననాడే నీటి సంక్షోభాల నుంచి బయటపడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా నీటి కొరతతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితులు ఇలా ఉంటే మండే మే నెలలో ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. జలాల వినియోగంపై అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే భవిష్యత్‌కు ముప్పు వాటిల్లకుండా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

పాణిగ్రాహి రాజశేఖర్ 9951185876

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News