Sunday, April 28, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చిన నేపథ్యంలో స్వామి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, ఆదివారం శ్రీవారిని 87,407 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న 31,713 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలతో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Also Read: యాదాద్రిలో భక్తుల రద్దీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News