Wednesday, May 15, 2024

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు..

- Advertisement -
- Advertisement -

Huge devotees visited Tirumala Temple

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో శ్రీవారిని 28,154మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. 13,077 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.15 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని వెంట తీసుకురావాలని టిటిడి పేర్కొంది. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరింది. రేపు నవంబర్ నెలకు సంబంధించిన వసతి గదుల కోటా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Huge devotees visited Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News