- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ.107.59కి, డీజిల్ ధర రూ.96.32కు పెరిగింది. ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.113.46కి, డీజిల్ ధర రూ.104.38కి చేరుకుంది.ఇక, హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్పై 35 పైసలు, 36 పైసల చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.111.91, డీజిల్ రూ.105.08కి చేరుకుంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.113.69, డీజిల్ రూ.106.26కి పెరిగింది.
Fuel Prices hiked for 5th straight day
- Advertisement -