Tuesday, April 30, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద.. 26 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 99,920వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి కాకతీయ కాలువకు 85,840వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు నీరు చేరుకోవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తలపిస్తుంది. దీంతో నదీతీరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చిరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News