బాలీవుడ్ హీరోయిన్స్ ఒకప్పుడు అయిదు, ఆరు కోట్ల పారితోషికం తీసుకుంటారట అంటూ సౌత్లో చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు నయనతార సౌత్లోనే అయిదు, ఆరు కోట్ల పారితోషికాన్ని అందుకుంటోంది. ఇక ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. నయనతారతో ఇప్పటికే రెండు సినిమా లను తమిళంలో తెరకెక్కించిన అట్లీ త్వరలో హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా ఒక సినిమాను చేయబోతున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతారను హీరోయిన్గా తీసుకోవాలని అట్లీ భావిస్తున్నాడట. అట్లీపై ఉన్న అభిమానంతో హిందీలో నటించేందుకు నయన్ దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నయనతార నటిస్తే దర్శకుడు అట్లీ ఏకంగా 7.5 కోట్ల రూపాయలను పారితోషికంగా ఇవ్వడంతో పాటు లాభాల్లో వాటాను కూడా నిర్మాత నుండి ఇప్పించేందుకు సిద్దంగా ఉన్నాడని తమిళ మీడియా వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ అనే బ్రాండ్ కు అంత పారితోషికం సబబే కదా అని ఆమె అభిమానులు, సన్నిహితులు అంటున్నారు.