Friday, April 26, 2024

దుబ్బాక ఉప ఎన్నికకు భారీ బందోబస్తు

- Advertisement -
- Advertisement -

Huge security setup for Dubbaka By-Election

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిద్దిపేట సిపి జోయల్ డెవిస్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి సెట్ కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాలను కలుపుతూ ఉన్న రూట్లలో పోలింగ్ కేంద్రం సమీపంలో ఎవరూ గుంపులుగా కనిపించకుండా చూడాలని అన్నారు. 200 గజాల వరకు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు లేకుండా చూడాలని సూచించారు. ఓటర్లను ప్రైవేటు వాహనాలు, ఆటోలు, జీపులు కార్లలో తీసుకురాకుండా చూడాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంల భద్రత, ఎన్నికల సామాగ్రి భద్రతాపోలింగ్ పూర్తయిన తర్వాత తిరిగి పంపేవరకు అప్రమత్తంగా ఉండాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు. ఆదేశాలు వచ్చే వరకు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రావొద్దని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో కి వచ్చే ఏజెంట్ల వద్ద అగ్గిపెట్టెలు, నీళ్ల బాటిళ్లు, సెల్ ఫోన్లు మరే ఇతర వస్తువులు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. చెక్ పోస్ట్ వద్ద అన్ని వాహనాలను తనికీ చేసి 24గంటలు విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News