Monday, May 6, 2024

ఉల్లి @ కిలో రూ. 10

- Advertisement -
- Advertisement -

Hugely reduced onion prices

భారీగా తగ్గిన ఉల్లి ధరలు

మనతెలంగాణ, హైదరాబాద్ : శాఖహార భోజన ప్రియులకు ఉల్లి, టమాటతో కూడిన వంటకం అంటే మహా ఇష్టం. ఈ రెండిటిలో ఏ ఒక్కటి తక్కువైనా వారు ఏ మాత్రం ఒప్పుకోరు. ఈ రెండింటిలో టమాట ధరలు రోజు రోజుకు పెరుగుతుంటే ఉల్లి ధరలు మాత్రం రోజుకు తగ్గిపోతూ వినియోగదారులకు పన్నీరును, రైతులకు కన్నీరును మిగులుస్తున్నాయి. గత కొద్ది రోజులకు మార్కెట్‌లో ఉల్లి దిగుబడులు అధికంగా ఉండటంతో వాటి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. రెండు మూడు సంవత్సరాల క్రితం ఉల్లి ఉల్లిగడ్డలు కొనుగోలు చేయాలంటే మార్కెటల్లో క్యూలో నిలబడి,ఆధార్‌కార్డు చూపించి కొనుగోలు చేయాల్సి వచ్చేది. అది కూడా కుటుంబానికి కేజి మాత్రమే ఇచ్చేవారు. ఉల్లి దిగుబడులు పూర్తి స్థాయిలో తగ్గిపోవడం. దాని ధర కిలో రూ.100 నుంచి 150 వరకు ఉండటంతో మార్కెటింగ్ శాఖ అధికారులు కిలో ఉల్లిగడ్డను సబ్సిడి కింద రూ.70 వినియోగదారులకు అందించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం భారీ ఎత్తున ఉల్లిగడ్డలు నగరానిక వచ్చి చేరుతుండంతో వాటి ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. మన రాష్ట్రంలో కొల్లాపూర్, తాండూరు,నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు,కర్నాటక,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లిగడ్డలు నగరంలోకి వచ్చి చేరుతున్నాయి. నగరానికి మహారాష్ట్ర,కర్నాటకు నుంచి రోజుకు 20 నుంచి 23 వేల బస్తాలు ఉల్లి దిగుమతి అవుతున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల నంచి అంటే కర్నూల్,మహబూబ్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి 5 వేల బస్తాలు తరలి వస్తున్నాయి. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు,పొరుగున ఉన్న ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున మార్కెట్ ఉల్లి దిగుమతులు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం హొల్ సేల్ మార్కెట్లో క్వింటాల్ ఉల్లి ధర రూ.1500 నుంచి రూ.1700 లకు పలికింది. అదే విధంగా సెకండ్ గ్రేడ్ ఉల్లి క్వింటాల్‌కు రూ.1000 నుంచి 1200కు పలికింది.

కాని ప్రస్తుతం ప్రధాన మార్కెట్లయిన మలక్‌పేట, బేగంబజార్, బోయినపల్లి, తదితర వాటిల్లో క్వింటాల్ ధర రూ.1100 నుంచి 1300ల లోపే పలుకుతుండగా సెకండ్ గ్రేడ్ ఉత్పత్తులు రూ. 700 పలుకుతోంది. ఇవి మార్కెట్లకు చేరుకునే సరికి పాడైపోతుండటంతో వాటిని క్వింటాల్‌కు రూ.300 నుంచి 500లకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే రిటైల మార్కెట్లో మాత్రం వీటినే కిలో రూ.8 నుంచి 12 కి విక్రయిస్తున్నారు. గతంలో మహారాష్ట్ర నుంచి ఆశించిన దానికి కంటే ఎక్కువ కావడంతో స్టాకును నిల్వ చేసుకున్న వారు ప్రస్తుతం పంట దిగుబడి పెరగడంతో ఇంకా వాటిని గోడౌన్లలో నిల్వ ఉంచుకుంటే మరింత నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందన్న ఆందోళనతో ఆ ప్రాంత రైతులు వాటిని నగరంలోని మార్కెట్లకు తరలించి నష్టానికి అమ్ముకుంటున్నారు.

పెద్ద ఎత్తున దిగుబడులు పెరగడంతో అనేక మంది ఉల్లి రైతులు మార్కెట్లో నేరుగా అమ్ముకోకుండా దళారులను నమ్ముతున్నారు. దాంతో వారు రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా నామ మాత్రపు ధరను చెల్లిస్తున్నారు. పండించిన పంటను స్టోరేజ్ చేసుకునే సదుపాయం లేక పోవడం,వాతావరణంలో మార్పులతో త్వరగా కుళ్ళి పోయే అవకాశం ఉండటం, మార్కెట్‌కు స్వయంగా వెళితే పెద్ద మొత్తంలో ట్రాన్స్‌పోర్టు ఖర్చులు అవుతాయనే ఉద్దేశ్యంతో వారు దళారులను ఆశ్రయిస్తున్నారు. దాంతో దళారులు రైతులకు కనీస గిట్టుబాటు ధరను కూ-డా చెల్లిండం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News