Thursday, May 16, 2024

పిఎస్ లో ఫిర్యాదు చేస్తావా?… మహిళపై పెట్రోల్ పోసి….

- Advertisement -
- Advertisement -

Husband friend sexual harassment on wife

లక్నో: దేశంలో రోజు రోజుకు లైంగిక వేధింపులు ఎక్కువగా అవుతున్నాయి. ఎక్కడ చూసిన మహిళలపై దాడులు చేయడంతో పాటు చంపేస్తున్నారు. ఓ బాధితురాలు తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లా కుల్పహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యుపికి చెందిన విపిన్ యాదవ్ అనే వ్యక్తి గుజరాత్‌లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. యుపిలోని తత్వార గ్రామానికి చెందిన వ్యక్తి విపిన్ యాదవ్‌కు పరిచయమయ్యాడు. అగస్టులో ఇద్దరు యుపికి వచ్చారు. ఇద్దరు స్నేహితులుగా ఉండడంతో తత్వార గ్రామనికి విపిన్‌ను తీసుకెళ్లాడు. స్నేహితుడి భార్య ఒంటరిగా ఉన్నప్పుగు విపిన్ ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె స్థానికి పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది. తన పైనే ఫిర్యాదు చేస్తావా? అని ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టడానికి విపిన్ ప్రయత్నించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News