Friday, May 3, 2024

భార్యను మంచానికి కట్టేసి… బాత్రూమ్‌లు కడిగే యాసిడ్ నోట్లో పోసి….

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్యపై అనుమానంతో ఆమెను మంచానికి కట్టేసి నోట్లో యాసిడ్ పోసి చంపిన సంఘటన విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామంలో చోటుచేసుకుంది. భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోరా తిరుపతి రావు అనే వ్యక్తికి 2011లో పావనితో పెళ్లి జరిగింది. దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారు. పిల్లల చదువుల నిమిత్తం సాలూరుకు వచ్చేశారు. అద్దె ఇంట్లో నివసిస్తూ ఆ దంపతులు జీవనం సాగిస్తున్నారు. భార్య పావనికి భర్త తిరుపతిరావు స్మార్ట్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. స్మార్ట్ ఫోన్‌లో మరోక వ్యక్తితో మాట్లాడిన సంభాషణలను భర్త రికార్డు చేశాడు. అంతేకాకుండా అతడితో దిగిన ఫోటోలను ఫోన్లు ఉండడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమేకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పావని తన అమ్మగారింటికి వెళ్లిపోయింది. పెద్దల దంపతులను కలిసి ఉండాలని తీర్మానం చేసి భార్య పావనిని ఇంటికి తీసుకెళ్లాలని భర్త తిరుపతి రావు సూచించారు. కుట్టు మిషన్ పని వెళ్లానని భర్తతో భార్య చెప్పగా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. వెంటనే భార్య భర్తపై దాడి చేసి అనంతరం టివి సౌండ్ పెద్దదిగా పెట్టి భార్యను మంచానికి కట్టేశాడు. అంతేకాకుండా భార్య నోట్లో బాత్రూమ్ కడిగే యాసిడ్ పోశాడు. అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేసి భార్య ఆత్మహత్య చేసుకుందని అందరిని నమ్మించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పావని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిరావుపై అనుమానం ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. నిందితుడు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Husband killed his wife with acid in Vijayanagaram
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News