Saturday, May 4, 2024

ప్రేమ పెళ్లి…. భార్యకు మద్యం తాగించి మట్టుబెట్టాడు…

- Advertisement -
- Advertisement -

Husband killed wife in osmania university

హైదరాబాద్: ప్రేమించాడు… పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికి మద్యం తాగే అలవాటు ఉంది. భార్యకు మద్యం తాగించి అనంతరం టవల్ సాయంతో గొంతు బిగించి హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సీతఫల్ మండికి చెందిన శకత్యాల, సౌందర్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇసిఐఎల్‌లో కూరుగాయాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు మద్యం తాగే అలవాటు ఉంది. ఇద్దరు మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. భార్యను చంపాలని భర్త నిర్ణయం తీసుకున్నాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఆమెకు మద్యం తాగించి అనంతరం గొంతుకు టవల్ బిగించి హత్య చేశాడు. నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నర్సింగ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News