Saturday, May 4, 2024

లిక్క‌ర్ బాటిల్ పడేసిందనే కోపంతో భార్యను చంపేశాడు

- Advertisement -
- Advertisement -

husband kills wife at uttar pradesh

ఖేరి: మ‌ద్యం బాటిల్ ప‌డ‌వేసింద‌నే కోపంతో భార్య‌ను కొట్టిచంపిన దారుణ సంఘటన యుపిలోని ఖేరి జిల్లాలో చోటుచేసుకుంది. రాయ్ పూర్ దులాహి గ్రామంలో నివాసముండే గీతాదేవి, ర‌మేష్ కుమార్ నిష‌ద్ దంప‌తుల నడుమ కొట్లాట జరిగింది. గొడవ కాస్త పెరగడంతో గీతాదేవి నిష‌ద్ చేతిలో ఉన్న లిక్కర్ బాటిల్ ను ప‌డేసింది. కాసేపటి త‌ర్వాత మ‌రోసారి ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన నిష‌ద్ పదునైన క‌ర్ర‌తో భార్య కొట్టాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు అక్క‌డికి చేరుకునే లోపే భ‌ర్త దాడితో గీతాదేవి మృతిచెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ప‌రారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

husband kills wife at uttar pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News