Wednesday, May 8, 2024

ఎపిలో కొత్తగా 17,188 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

17188 new covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 1,00,424 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 17,188 మందికి వైరస్ సోకిందని, మరో 73 మంది మృతిచెందారని ఎపి వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సంఘాల్ తెలిపారు. అదే సమయంలో 12,749 మందికి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 12,45,374 మందికి కరోనా సోకింది. మొత్తం 1,71,60,870 మందికి టెస్టులు చేశారు. ఆంధ్రలో ఇప్పటివరకు కరోనాతో 10,50,160 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపివ్యాప్తంగా 1,86,695 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,260 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

17188 new covid-19 cases reported in AP

 

17188 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News