Friday, April 26, 2024

మద్యం మత్తులో.. భార్యను కొట్టి చంపిన కిరాతకుడు

- Advertisement -
- Advertisement -

 killed

 

హైదరాబాద్ : కట్టుకున్న భార్యను మద్యం మత్తులో కిరాతకంగా హత్యచేసిన సంఘటన లంగర్‌హౌస్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం ముసిరఫా గ్రామానికి చెందిన కె.ఎల్లప్ప, అమృతమ్మ(35) దంపతులు బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి లంగర్‌హౌస్‌లోని మందుల బస్తీలో నివాసముంటున్నారు. దినసరి కూలీగా పనిచేసే ఎల్లప్ప నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చేవారు. రోజుమాదిరిగానే మంగళవారం అర్థరాత్రి చిత్తుగా మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య అమృతమ్మతో వాగ్వాదం జరిగింది. మాటమాట పెరగడంతో ఆవేశానికి గురైన ఎల్లప్ప ఇంట్లో ఉన్న చిన్నగ్యాస్ సిలిండర్ తీసుకుని భార్యపై దాడిచేయడంతో అమృతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. అమృతమ్మ కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

Husband who brutally killed his Wife
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News