Friday, April 26, 2024

భార్యల గొంతుకోసిన భర్తలు

- Advertisement -
- Advertisement -

husbands killed wife at bhadradri kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే రోజు రెండు సంఘటనలు
కుటుంబ సమస్యలతో భార్యలను కడతేర్చిన భర్తలు

ఖమ్మం: భార్య ను నరికి చంపిన రెండు వేర్వేరు సంఘటనలు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్నాయి. రెండు సం ఘటనలో అత్యంత కిరాతకంగా భార్తల ను నరికి చంపి మృగాలుగా మారారు. మణుగూర్ పట్టణంలో సుందరయ్య నగర్‌లో బత్తుల శ్రీనివాస్, సుధా అనే దంపతులు ఉన్నారు. బత్తుల శ్రీనివాస్ గత కొంతకాలంగా మద్యానికి బానిసగా మా రి తరచుగా భార్యతో గొడవ పడుతూ వ స్తున్నారు. గురువారం రాత్రి కూడా ఇద్ద రు మరోసారి గొడవ పడ్డారు. ఈక్రమం లో శుక్రవారం తెల్లవారుజామున కూరగాయాలను కోసే కత్తితో శ్రీనివాస్ నిద్రిస్తున్న తన భార్య సుధా(31)గొంతు కోసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో నిద్రలోనే ఆమె ప్రాణం విడిచింది.కుమారుడు సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

మరో సంఘటనలో కూడా ఇదే విధంగా నిద్రిస్తున్న భార్యను గొంతు కోసి పారిపోయాడు. బుర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ పరిధిలో సులానగర్ ప్రాంతానికి చెందిన జనార్దన్‌కు గాంధీనగర్ కాలనీకి చెందిన బందేళ అనూషతో ఐదేళ్ళ క్రితం వివాహం జరిగింది.పెళ్లి అయిన నాటి నుంచి ఇరువురి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.ఈనేపథ్యంలో అనూషను వారి తల్లిదండ్రులు వారి స్వగ్రామమైన గాంధినగర్ కాలనీకి తీసుకెళ్ళారు. అల్లుడు కూడా రెండు రోజుల క్రితం అత్తవారింటికి వచ్చి అక్కడే ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో భార్య గొంతు కోసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

husbands killed wife at bhadradri kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News