Wednesday, May 1, 2024

హుజూరాబాద్‌లో పోటీకి కొండా సురేఖ నో.. తెరపైకి ముగ్గురి పేర్లు

- Advertisement -
- Advertisement -

huzurabad bypoll election 2021

హైదరాబాద్:  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ మంత్రి కొండా సురేఖ విముఖత చూపడంతో పోటీకి ఆసక్తిగా ఉన్న అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వం వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది. అయితే ఈ స్థానం నుండి పోటీకి ఆమె విముఖత చూపింది. ఈ విషయాన్ని గురువారం సాయంత్రం కొండా సురేఖ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పింది. అయితే కొత్త అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్వేషణను మొదలుపెట్టింది. హూజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పత్తి కృష్ణారెడ్డి, వ్యాపారవేత్త రవికుమార్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరును కూడా కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై పిసిసి ఎన్నికల కమిటీ పిసిసికి తమ సిఫారసును పంపింది. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణికం ఠాగూర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మాణికం ఠాగూర్‌తో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహా భేటీ అయి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News