Saturday, April 27, 2024

ముగిసిన హుజురాబాద్ నామినేషన్లు

- Advertisement -
- Advertisement -

Huzurabad nominations closed

హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు గడువు ముగిసింది. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ శుక్రవారం నామినేషన్లు వేశారు. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు విధించారు. ఈనెల 30న పోలింగ్, నవంబరు 2న ఓట్లను లెక్కిస్తారు.

30న హుజూరాబాద్ నియోజకవర్గంలో సెలవు

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ నియోజక వర్గం పరిధిలో నివసించే వారికి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంటల్ యాక్ట్1881 ప్రకారం పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News